అర్థరాత్రి వేళ నగదు మరియు బంగారం చోరీ

Dec 17, 2025 - 20:56
 0  247
అర్థరాత్రి వేళ నగదు మరియు బంగారం చోరీ

తిరుమలగిరి 17 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గోపాల్ దాస్ రమేష్ నిన్న రాత్రి 10 గంటలకు ఇంటికీ తాళం వేసుకొని డ్రైవింగ్ డ్యూటీకి వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంటి లోపల బీరువాలో పెట్టి ఉన్న రూ.2,30,000 అర్ధ తులం బంగారం దొంగలించకపోయినారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి