అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీస్ సిబ్బంది
అడ్డగూడూరు 10 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్మించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త కొరకు ఫ్లాగ్ మార్చి నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మోత్కూర్ ఎస్సై మండలం పోలీస్ సిబ్బంది వివిధ మండలాల పోలీస్ సిబ్బంది కర్ణాటక రాష్ట్ర పోలీస్ సిబ్బంది సుమారు 50 మంది పాల్గొన్నారు.