అందరితో కలిసి శ్రీశైలం నిర్వహితులకు న్యాయం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

Aug 4, 2024 - 19:32
 0  146
అందరితో కలిసి శ్రీశైలం నిర్వహితులకు న్యాయం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

04-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్  జిల్లాల శ్రీశైలం నిర్వాసితులు ఈరోజు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డిని పెబ్బేర్ లో  కలిసి తమ 40 సంవత్సరాల గోడును వెళ్ళబోసుకొన్న శ్రీశైలం నిర్వాసితులు.

 ఎమ్మెల్యే మెగా రెడ్డికి శ్రీశైలం నిర్వహితులు ముందుగా పూలమాలవేసి శాలువాతో సన్మానించారు.

శ్రీశైలం ముంపు బాధితులు ఈరోజు మూడు జిల్లాల నుండి భారీగా బాధితులు పెబ్బేరుకు హాజరై ఎమ్మెల్యే మెగారెడ్డిని కలవడం  జరిగింది. 

 ఎమ్మెల్యే మెగా రెడ్డి  మాట్లాడుతూ జీవో 98 బాధ్యతల సమస్యపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మరియు నేను, జూపల్లి కృష్ణారావు కలసి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ముఖ్యమంత్రి  కూడా సానుకూలంగా స్పందించినాడు. తొందరలోనే మరోసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  మరియు జూపల్లి కృష్ణారావు ని కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి శ్రీశైలం నిర్వాసితుల సమస్యను తీసుకువెళ్తాను, మీకు ఉద్యోగాలు వచ్చేవరకు 98 Go, బాధితులను మిమ్ములను మీ ఫైల్ ను విడిచిపెట్టను, ఈ రెండు మూడు రోజుల్లోనే మళ్లీ మాట్లాడుతాను అని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి శ్రీశైలం బాధితులకు హామీ ఇవ్వటం జరిగినది.

 ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల శ్రీశైలం నిర్వహితులు పాల్గొనడం జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State