కాకులను కొట్టి....గద్దలకు పెట్టే రాబందుల బడ్జెట్

Jul 25, 2024 - 08:54
Jul 25, 2024 - 18:10
 0  27
కాకులను కొట్టి....గద్దలకు పెట్టే రాబందుల బడ్జెట్

తెలంగాణ వార్త కాకులను కొట్టి....గద్దలకు పెట్టే రాబందుల బడ్జెట్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి.... జె ఎస్ ఆర్ సార్ ---------------------------------- బడ్జెట్ 2024: తీవ్ర సమస్యలపై అలక్ష్యం, మధ్య తరగతికి నోటిమాటలు, రైతులు, విద్యార్థులు, పేదలకు విద్రోహం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024, కొన్ని ఉన్నతమైన ఆలోచనల, స్వీయ-అభినందనల పదాల గారడీ తో భారత ప్రజల కష్టాలను ప్రభుత్వం విస్మరించే కళను ఎలా కొనసాగిస్తుందో వివరిస్తుంది. పెద్ద యెత్తున విద్రోహపూరిత విధానాలను దాచిపెట్టే కుత్సిత వాక్చాతుర్యానికి జనాలు మోసపోరని మోడీ పాలనకు లోక్ సభ ఎన్నికల తీర్పు ద్వారా మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌ను సమర్పించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అహంకారపూరితంగా ఆ సంకేతాలను పట్టించుకొనే పరిస్థితి లో లేదనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రుషి బో రా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు (C2+50) ప్రకారం లెక్కించిన ఇన్‌పుట్ ఖర్చుపై 50% లాభం ఉండేలా అన్ని పంటలకు చట్టబద్ధంగా కనీస మద్దత్తు ధరను అందించాలన్న రైతుల డిమాండ్ పూర్తిగా విస్మరించబడింది. అప్పులపాలైన రైతులకు రుణమాఫీ, రైతులకు పెన్షన్, కిసాన్ సమ్మాన్ నిధిలో ఖర్చు పెంపు డిమాండ్లను కూడా బడ్జెట్ పట్టించుకోలేదు. భారతీయ శ్రామిక శక్తిలో సగానికిపైగా ఉపాధిని అందిస్తున్న వ్యవసాయానికి వాగ్దానం చేసిన బడ్జెట్ కేటాయింపు కేవలం 2.5% మాత్రమే. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి ఉపశమనం కల్పిస్తామని హామీ ఇవ్వడానికి బదులు, వాతావరణాన్ని తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే పంటల పేరుతో జన్యుమార్పిడి పంటల దురాక్రమణను ఆర్థిక మంత్రి మరింతగా ఆహ్వానించారు. భారత వ్యవసాయంలో జన్యుమార్పిడి పంటల అమలుకు వ్యతిరేకంగా దేశంలోని రైతులు పదే పదే నిరసనలు చేస్తున్నారనీ ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషిబోరా దేవాన్ష్ జె కే ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ తెలిపారు. పెరుగుతున్న నిరుద్యోగాన్ని పదే పదే లేదంటూ, ఉద్యోగలకు సంబంధించిన డేటాను నకిలీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఇంటర్న్‌ షిప్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసపూరితంగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంది. దేశంలోని విద్యావంతులైన యువతకు తక్కువ జీతంతో ఇంటర్న్‌షిప్‌లను అందించే విధంగా ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తున్నారు.ఇది కేవలం మనుగడ కోసం ఉద్దేశించిన భద్రత లేని తక్కువ జీతంతో కూడిన పనిని ఉపాధి కల్పన గా చూపించే ప్రభుత్వ మోసపూరిత విధానానికి కొనసాగింపుగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల విస్తరణకు హామీ ఇవ్వలేదు లేదా ప్రైవేట్ రంగం గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను విస్తరించేలా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు.ఉద్యోగాలనుప్రోత్సహించే పేరుతో, నాలుగేళ్లపాటు EPFO కంట్రిబ్యూషన్‌కు ప్రోత్సాహక హామీ ఇచ్చారు. జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు పెరుగుతున్నప్పటికి మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పథకం వ్యయాన్ని మాత్రం స్తబ్దతకు గురిచేశారనీ ప్రజా బంధువు.... కార్మిక వర్గ బోరపుత్రుడు.... శ్రామికు వరక రాజ్యాధికార స్వప్నికుడు.... కమ్యూనిస్టు విప్లవకారుడు... ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ 832877285 ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ వంటి పరీక్షల్లో మోసాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న తరుణంలో, పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్‌టిఎ దారుణంగా విఫలమైన తరుణంలో, వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వలేదు. సమాజంలోని చాలా మంది అణగారిన వర్గాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చకుండా ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యా రుణాలను ప్రోత్సహించింది. విద్యార్థులు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల విద్యా రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మైనారిటీ మతాల నేపధ్యం గల విద్యార్థులకు ఉద్దేశించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ కోసం కేటాయింపులు తగ్గించబడ్డాయనీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి పూర్తిగా విస్మరించారు. భారీ ద్రవ్యోల్బణం, వేతనాల కోత వంటి తీవ్ర సమస్యల గురించి బడ్జెట్ ప్రసంగంలో క్లుప్తంగా కొట్టిపారేశారు. రూ. 3 నుండి 10 లక్షల వార్షిక ఆదాయం ఆర్జించే మధ్య తరగతి వర్గానికి కేవలం కంటి తుడుపు చర్య గా ఉపాంత పన్ను ప్రయోజనంతో సరిపెట్టింది. పరోక్ష పన్ను చెల్లింపుదారులలో అత్యధికులకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. సంగ్రహంగా చెప్పాలంటే, కేంద్ర బడ్జెట్ 2024 దేశంలో కష్టాలను అనుభవిస్తున్న కార్మికవర్గం, రైతులు, విద్యార్థులు, యువత దుస్థితిని గాలికొదిలేసి పట్టించుకోలేదనీ భారత కమ్యూనిస్టు పార్టీ... సిపిఐ ( ఎం- ఎల్) కార్యదర్శి కామ్రేడ్...JKR గారి JSR సార్ 9848540078 పేర్కొన్నారు.