సొంతింటి ఇల్లు కోసం వికలాంగుడు ఎంపీడీవోకి వినతి పత్రం అందచేత గుండాల
02 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పరిధిలోని వెల్మజాల గ్రామం గత 35 సంవత్సరాలుగా నివాసము ఉంటున్నాను అమ్మానాన్న తల్లిదండ్రులు చిన్నప్పుడే 25 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది.అప్పటినుండి మా నానమ్మతోనే కలిసి ఉండేవాడు ఆమె కూడాగత 8 సంవత్సరాల క్రితమే ఆమె కూడా చనిపోవడం జరిగింది.అతనికి తోడు నీడ కూడా నాయనమ్మ లేకపోవడం బాధితుడు కన్నీరు మునీరు బాధను వెళ్ల బుచ్చుకున్నారు, బాధితుడు చెప్పిన మాటలు నేను ఒక్కడినే ఒంటరిగా నివాసం చేస్తున్నాను నేను వికలాంగుడను నాకు ఇంటి స్థలం ఉన్నది,కాబట్టి వికలాంగుల కోట నుండి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజు చేయవలసిందిగా ఎంపీడీవో నాయందు దయ తలచి వికాలాంగుల కోట కింద అయినా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మండల ప్రజాపరిషత్ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.