షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన""కోదాడ షీ టీమ్స్
కోదాడ షీ టీమ్* *షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కోదాడ DSP శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో, కోదాడ షీ టీం వారు పట్టణం లోని MS కళాశాల లో షీటీమ్స్, సైబర్ నేరాల పై పోలీసు కళాభృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది
కోదాడ షీ టీం SI మల్లేశం గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో షీ టీమ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* *అతిక్రమించొద్దు అని అన్నారు.
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన* *తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు.* *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన* *కల్పించారు.
ఈ కార్యక్రమంలో MS కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, CEO శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ప్రసాద్ గారు,కోదాడ షీ టీం మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత, మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, కానిస్టేబుల్ నరేంద్రబాబు, పోలీస్ కళాబృందం సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ, సత్యం,విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.