వ్యవసాయ పొలం దున్నుతూ గుండెపోటుతో  మృతి చెందిన యువ రైతు

Jul 2, 2026 - 19:59
 0  2
వ్యవసాయ పొలం దున్నుతూ గుండెపోటుతో  మృతి చెందిన యువ రైతు

కేటీదొడ్డి:- వ్యవసాయ పొలం దున్నుతూ ఓ యూవ రైతు మృతి చెందారు. ఈ ఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లా  కేటీ దొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంట గ్రామానికి చెందిన యూవరైతు మాల వీరేష్(30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. గురువారం తన వ్యవసాయ పొలం దున్నుతూన్న క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఆ యూవ రైతుకు భార్య, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో  చింతలకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333