వెలిశాల మత్స్య పారిశ్రామిక అధ్యక్షుడిగా రవీందర్
వెలిశాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక
నూతన అధ్యక్షునిగా మొగిలి రవీందర్ ముదిరాజ్
తిరుమలగిరి 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో తన తరపు ఐదుగురు డైరెక్టర్ అభ్యర్థులు గెలవగా అధ్యక్ష పదవి ఏకగ్రీవం అయ్యింది ఉపాధ్యక్షునిగా సోడ భిక్షం,కార్యదర్శిగా మొగిలి రమేష్ డైరెక్టర్లుగా మొగిలి సాయికిరణ్ , రాజశేఖర్,యాకన్న ,సైదులు, ఉపేందర్,సత్తయ్యలు గెలుపొందారు నూతన అధ్యక్షునిగ ఎన్నికైన తరువాత మొగిలి రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయిస్తానని అన్నారు..