మిత్రమా....నీ జ్ఞాపకాలు మరవం....
స్నేహితుడి జ్ఞాపకార్థం యాచకులకు అన్నదానం చేసిన విద్యార్థులు.....
సూర్యాపేట , జూన్ 05 :- కన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టలేని ప్రస్తుత ఈ సమాజంలో తన చిన్ననాటి స్నేహితుడి జ్ఞాపకార్థం మిత్రులు అన్నదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. బాణోతు గోపి అనే విద్యార్థి అనారోగ్యానికి గురై ఈ ఏడాది ఏప్రిల్ 30 న అకాల మరణం చెందారు.అందుకు బుదవారం మిత్రుడి పుట్టినరోజు సంధర్భంగా పదవ తరగతి చదివే తోటి విద్యార్థులు ఆయన జ్ఞాపకార్థం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోనీ యాచకులకు అన్నదానం చేశారు.దీన్ని గమనించిన పలువురు ప్రముఖులు స్నేహితుడి జ్ఞాపకార్థం కోసం స్వతహాగా ఖర్చు పెట్టి ఆటోలో తిరుగుకుంటూ ఇతరుల కడుపు నింపడం ద్వారా ఔరా... అనిపించుకున్నారు.ఈ అన్నదానంలో విద్యార్థులు సాత్విక్,అక్షయ్,చిన్న చరణ్,సాగర చరణ్, సూర్య,రోహిత్ తదితరులు ఉన్నారు.