దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి ఇటికాల విజయ్

తిరుమలగిరి 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- పార్లమెంట్ లో రాజ్యాంగం వల్ల పదవులు పొందిన అమిత్ షా భారత అత్యున్నత పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ ని పదే పదే అవమానించడం దేశ ప్రజల గౌరవాన్ని అవమానించడం అని సూర్యాపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తిరుమలగిరి మండలం కోశాధికారి ఇటికాల విజయ్ మహరాజ్ డిమాండ్ చేశారు.కబడ్ధార్ అమిత్ షా నువ్వు పొందిన అనుభవించే పదవులు,రాజాభోగాలు,కేంద్ర మంత్రి పదవి, జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ ఎక్కడివి ఆ మహనీయుని పుణ్యం వల్లనే నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ ప్రజలకే కాకుండ అంబెడ్కర్ ని అవమానించిన నువ్వు అదే అంబెడ్కర్ విగ్రహాన్ని కి సాష్టాంగ నమస్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కబడ్ధార్ అమిత్ షా ఎ నిండు సభలో అవమానించావో అదే సభలో తప్పు అని ఒప్పుకొని ఆ అమాటలను వెనక్కి తీసుకోక పోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. అన్నారు