డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన సూర్యాపేట పాలకీడు పిఎస్

తెలంగాణ వార్త ప్రతినిధి హుజూర్నగర్ : డ్రగ్స్, సైబర్ నేరాల పై అవగాహన పాలకీడు PS పరిది *ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పాలకీడు SI లక్ష్మీ నరసయ్య గారు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ హైస్కూల్లో సైబర్ నేరాలపైన పోలీసు కళాభృందం తో విద్యార్థిని విద్యార్థులకు కు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
పాలకీడు HC అంజయ్య గౌడ్
మాట్లాడుతూ జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* *అతిక్రమించొద్దు అని అన్నారు.
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన* *కల్పించారు
ఈ కార్యక్రమం నందు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ హైస్కూల్ హెడ్మాస్టర్ జార్జ్ దేవాస్య గారు, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనువాస్,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి,గురులింగం, క్రిష్ణ,చారి, మరియు విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.*