డైమండ్ బేకరి లో నాసిరకం వస్తువుల విక్రయం
సూర్యాపేట జిల్లా కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల డైమండ్ బేకరీలో డేట్ లేకుండా విక్రయాలు చేస్తూ ఉండటంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ యాదగిరి లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6000 రూపాయలను జరిమానా విధించి కేసు నమోదు చేశారు. నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు.