కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ  జయంతి వేడుకలు 

Jul 8, 2024 - 19:45
Jul 8, 2024 - 20:22
 0  41
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ  జయంతి వేడుకలు 

సూర్యాపేట. 08 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జలయజ్ఞ ప్రదాత, సంక్షేమ సారధి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో  మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సూర్యాపేట  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004, 2009వ సంవత్సరంలో రెండు పర్యాయాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

పాదయాత్ర చేసి కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి  విశేష కృషి సల్ఫారని తెలిపారు. అధికారంలో రాగానే ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ చేసి, దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచారని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీరవెల్లి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కుంభం రాజేందర్, రవి నాయక్, గండూరి రాధిక రమేష్, వేములకొండ పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలెబోయి నరసయ్య యాదవ్, గోదల రంగారెడ్డి,  కర్ణాకర్ రెడ్డి, వెన్న మధుకర్ రెడ్డి, అరుణ్, దివ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333