వైఎస్సార్  వీరాభిమాని  సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో 

Jul 8, 2024 - 19:43
 0  19
వైఎస్సార్  వీరాభిమాని  సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో 

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుక

 వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన  వీరాభిమాని

సూర్యాపేట: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ని  పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ లోని  వైఎస్సార్ వీరాభిమాని  సాజిద్ ఖాన్  ఆధ్వర్యంలో  ఆయన ఇంటి ఆవరణంలో వై,ఎస్, రాజశేఖర్  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జల యజ్ఞం ప్రదాత గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రెండు పర్యాయాలు గెలుపొందారని 2009 సంవత్సరం లో హెలికాప్టర్ ప్రమాదంలో  అకాల మరణం చెందారని.అయినా నేటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచి అభివృద్ధికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.

 వైఎస్ఆర్ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసి, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ లు  కల్పించి పెద్దపీఠవేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు ఉప్పుల మధు, మీసాల ప్రసాద్, బొజ్జ విజయ్, గోరుగంటి దేవేందర్, పిడమర్తి ఉపేందర్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333