కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Oct 18, 2024 - 19:43
 0  2
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి 18 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి నియోజకవర్గం శుక్రవారం రోజు రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరైన 13,01,508 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన స్థానిక పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి హనుమాన్ల యశస్విని ఝాన్సీ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు,రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని,పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు, నిరుపేదలు ఆసుపత్రిలో ఆపద కాలంలో ఖర్చుపెట్టిన సొమ్మును ముఖ్యమంత్రి దయంత హృదయంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తిరిగి చలిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  యశస్విని ఝాన్సీ రెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333