కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
AP: కర్నూలు (D) మంత్రాలయం (M) చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తున్న బొలేరో వాహనం - లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలేరోలోని 8 మంది చనిపోయారు. ఘటనాస్థలిలో ఐదుగురు, చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.