ఒక విద్యార్థి.. ఒక టీచర్
గాంధీనగర్ పాఠశాల పరిస్థితి
ఒక్కరి కోసమే బడి
ఊరిలో 55 కుటుంబాలు ఉన్నా.. సర్కారు బడికి వస్తున్నది మాత్రం ఒకే ఒక్క విద్యార్థి. ఆ స్టూడెంట్ కు పాఠాలు చెప్పడా నికి ఒక టీచర్ ఉన్నారు. ప్రైవేట్ బడుల మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను ఏ స్థాయిలో పక్కనపెడుతున్నారో చెప్పేందుకు మేళ్లచెరువు మండలం గాంధీనగర్ తండా పాఠశాల పరిస్థితి నిదర్శనంగా నిలుస్తున్నది. గతేడాది కేవలం ముగ్గురు విద్యార్థు లతోనే స్కూల్ ను నడిపారు. ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఐదో తరగతి పూర్తి చేసుకొని ఇతర పాఠశాలలకు వెళ్లారని, దీంతో ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న ఒక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు హాజరవుతున్నాడని ఉపాధ్యాయుడు తెలిపారు.