ఆశ వర్కర్లు అరెస్ట్
తిరుమలగిరి 29 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆశా వర్కర్లకు ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అరెస్టు చేయడం తగదని జిల్లా అధ్యక్షురాలు గోపగాని విజయ తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం 4 గంటల నుండి ఆశా కార్యకర్తలను ఇంటి దగ్గరకు వెళ్లి ముందస్తు అరెస్టులు చేయడం దేనికని.. పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు ఆశా వర్కర్లు తమ వేతనాన్ని 18 వేల రూపాయలు పెంచాలని కోరుతూ ,శాంతియుతంగా పోరాటం చేస్తున్న, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమ అరెస్టులు, అమానుషమని ఆశా వర్కర్లు అన్నారు. నేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పోలీసులు, ఆశా వర్కర్లను అక్రమంగా ముందస్తు అరెస్టు నిర్వహించారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆశ వర్కర్లకు 18 వేల రూపాయల జీతం కావాలని ప్రభుత్వం పై, డిమాండ్ చేయగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా వేతనాన్ని పెంచుతామని, ఎన్నికల్లో గెలిచి, నేటి వరకు కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు డాక్టర్ల కంటే పనులు భారమైనప్పటికీ, కనీసం రోజుకు 500 రూపాయలు కూడా గిట్టకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు పెంచే విధంగా కృషి చేయాలని వారు కోరారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ పోలీసులు ఉదయమే వచ్చి, అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆశ వర్కర్లు కొమ్ము విజయ మాసంపల్లి మాధవి బొబ్బల మహేశ్వరి వేముల ఏకలక్ష్మి చింతల శైలజ జంపాల స్వరూప రహేళ రజిత మార్క్ సావిత్రి భద్ర ఉమా మంజుల శారద మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు