హనుమాన్ శోభా యత్ర కు సరితమ్మ ఆహ్వానించిన

- విశ్వహిందూ పరిషత్, బజారంగ్ దళ్ సభ్యులు...
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. కాంగ్రెస్ పార్టీ సతమ్మ క్యాంపు కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ అధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన జరిగే "హనుమాన్ శోభాయాత్ర" కు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ను గద్వాల కమిటీ సభ్యులు ఆహ్వానం పత్రం ఇచ్చి ఆహ్వానించారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు.