**వైన్ షాపుల వద్ద ఆగని సీటింగ్""పట్టించుకోని జగ్గయ్యపేట నియోజకవర్గం ఎక్సైజ్ శాఖ అధికారులు*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : *వైన్ షాప్ ల వద్ద ఆగని సిట్టింగ్*
పట్టించుకోని జగ్గయ్యపేట నియోజకవర్గ ఎక్సైజ్ శాఖ అధికారులు ,వైన్ షాప్ వారు.
రాత్రి బండిపాలెం వైన్ షాప్ వద్ద పక్కనే అమ్ముతున్నటువంటి గ్లాసులు వివిధ రకాల తినుబండరాలు అమ్మే వారి మధ్య, మందు బాబులు మధ్య జరిగిన ఘర్షణకు చిలికి చిలికి గాలివానై అక్కడ వారు అమ్మేపాకను పడేసారు అనేది సమాచారం .?వ్యాపారం నడిపేవారు కేసు పెట్టినట్లు సమాచారం.?
అసలు ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాల్లో ఐదు నుంచి సుమారు పది బెల్ట్ షాపులు కూడా ఇచ్చినట్లు సమాచారం.
మా వాటాలు మాకొస్తాయి అని ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు సబబు.
ఈ బెల్టు షాపులకు బడులు లేవు. గుడులులేవు ఎక్కడపడితే అక్కడ నడుపుతున్నారు.
అందిన కాడికి అధిక రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వైనం.
ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఐదు రూపాయలు ఇంకా తినబండారాలపై వారి ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు.