జర్నలిస్టు రమణ పార్థివ దేహానికి నివాళులర్పించిన

జెడ్పిటిసి జీడి బిక్షం

Jul 2, 2024 - 21:40
 0  25
జర్నలిస్టు రమణ పార్థివ దేహానికి నివాళులర్పించిన

రమణ భార్యకు ఆర్థిక సహాయం అందజేసిన జెడ్పిటిసి

సీనియర్ పాత్రికేయులు మాడుగుల రమణ ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలుసుకొని సూర్యాపేట జెడ్పిటిసి జీడి బిక్షం రమణ సొంత గ్రామం సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామానికి చేరుకొని రమణ పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రమణ భార్యకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి జీడి బిక్షం మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రమణతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.వివాదాలకు తావులేని మంచి జర్నలిస్టుగా రమణ కొనసాగారని అలాంటి జర్నలిస్టు మృతి చెందడం బాధాకరమైన విషయం అన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333