వానాకాలం సీజన్ కు కందులు మీ రైతు వేదికలలో  అందుబాటులో ఉన్నాయి.

Jun 19, 2026 - 22:20
Jun 19, 2026 - 22:22
 0  0
వానాకాలం సీజన్ కు కందులు మీ రైతు వేదికలలో  అందుబాటులో ఉన్నాయి.

ఇటిక్యాల వ్యవసాయ అధికారి రవికుమార్. 

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం కు  వానాకాలం సీజన్ కు గాను  కందులు  పి. ఆర్. జి -176 రకము విత్తనాలు 9.88 క్వింటాలు, ఎల్ . ఆర్.జి - 52 రకము 5 క్వింటాలు, ఆశ రకము 5 క్వింటాలు సరఫరా చేయడం జరిగింది. ఒక క్వింటమ్ పూర్తి ధర 13000, సబ్సిడీ ధర ఒక క్వింటమ్ కు 3000. రైతు చెల్లించవలసిన ధర  10000.  ఎల్. ఆర్. జి 133-33 రకము విత్తనాలు 5 క్వింటాలు సరఫరా చేయడం జరిగింది. ఒక క్వింటమ్ పూర్తి ధర 13000. సబ్సిడీ ధర ఒక క్వింటమ్ 6000. రైతు చెల్లించవలసిన ధర ఒక క్వింటమ్ 7000. కంది విత్తనాలు కావలసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మీ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి కంది విత్తనాలు తీసుకోవాలని మండల ప్రజలను మండల వ్యవసాయ అధికారి ప్రజలను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333