లక్ష్మీ నాధునికి పుష్పాలకరణ సేవ

సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) 25 ఏప్రియల్ 2025: మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి తదుపరి అష్టోత్తర శతనామావళి చేసారు. అర్చకుడు మాట్లాడుతూ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు మరియు అలంకరణ నిర్వహిస్తామని తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించి తరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.