రూ. 20 లక్షలతో వసతి గృహ నిర్మాణం
జోగులాంబ గద్వాల 9 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు రూ .20 లక్షలతో వసతి గృహ నిర్మాణం పనులు చురుకుగా జరుగుతున్నాయి. బెంగళూరు పట్టణానికి చెందిన విశ్వనాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూ .20 లక్షలతో నిర్మించే వసతి గృహానికి దేవాలయ ఈవో పురంధర్ కుమార్ దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం విశ్వనాథం కుటుంబ సభ్యులను దేవాలయ ఈవో అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు.