మురికి కూపంగా మారిన కృష్ణా పుష్కర ఘాట్లు
జోగులాంబ గద్వాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాట్లు దుర్గంధంగా మారాయి. నదీ స్నానానికి వచ్చే భక్తులు ఇక్కడ పాత దుస్తులను వదిలేసి వెళుతున్నారు. కనీసం పరిశుభ్రత పాటించాలని ఇంగిత జ్ఞానం కూడా లేని పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ లో దగ్గర ప్రత్యేకంగా పర్యవేక్షణ లేకపోవడంతో మురుగునీటిని తలపిస్తున్నది. సంబంధిత అధికారులు స్పందించి పరిశుభ్రంగా చేయాలని భక్తులు కోరుతున్నారు.