మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు ఎస్సై నాగరాజు

Jul 4, 2024 - 23:40
 0  3

అడ్డగూడూరు 04 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన దుర్సోజు రవీంద్ర చారి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సట్టు శైలజ అనే మహిళతో సంవత్సరం నుంచి ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా సైగలు చేస్తూ , ఆ మహిళ తన ఇంట్లో బాత్రూంలో స్నానం చేయడానికి వెళుతుండగా దుర్సోజు రవీంద్రాచారి , సట్టు శైలజ ను చూసి అసభ్యంగా సైగలు చేసినాడు. ఇట్టి విషయాన్ని సట్టు శైలజ తన భర్త అయినా   సట్టు రవితో చెప్పగా! సట్టు రవి, తన సోదరుడు అయినా సట్టు పరుశరాములుతో పాటు మరి కొంతతో మంది కలిసి దుర్శోజు రవీంద్రాచారి ఇంటికి వెళ్లి, అటు విషయం గురించి రవీంద్రచారిని అడుగగా రవీంద్ర చారి భార్య అసభ్యకరమైన బూతు మాటలు అని శైలజని తిట్టి, రవినీ నెట్టి వేయడం జరిగింది.ఇట్టి విషయంపై అడ్డగూడూరు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333