మద్దిరాల ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సస్పెండ్
యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ లైసెన్స్ను కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం సస్పెండ్ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఏడీఏ రమేషాబాబుతో కలిసి దుకాణాన్ని తనిఖీ చేసి ఈ చర్యలు చేపట్టారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో అమీషా రునిస్ పాల్గొన్నారు.