మండల ప్రజా పరిషత్ ఇటిక్యాల మండల సాధారణ సర్వ సభ్య సమావేశం.

May 3, 2024 - 21:32
May 4, 2024 - 20:16
 0  45

జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల ప్రజా పరిషత్ ఇటిక్యాల మండల  సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి ఇటిక్యాల ఎంపీపీ జి స్నేహ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన మండల స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమానికి హాజరై వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. వ్యవసాయ శాఖపై జడ్పిటిసి హనుమంత్ రెడ్డి,   వడ్ల  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యకున్నా ఏర్పాటు చేశామని సభలో అధికారులు సభకు తెలియజేశారు. ఆ విషయంపై జడ్పిటిసి కలగజేసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చేశామని చెప్పడం సమంజసం కాదని వ్యవసాయ అధికారులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి,     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్   సర్వసర సమావేశానికి సరిగా హాజరు కావడం లేదని ఆ శాఖ పై ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులు మాట్లాడుతూ....

ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎంపీడీవో ఎండి అజార్ మోహియుద్దిన్ , ఎంపీ ఓ భాస్కర్ యాదవ్, ఏపీవో, శివజ్యోతి, పంచాయతీ రాజ్ ఏఈ పాండురంగయ్య , రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ అజిత్ కుమార్ , ఐసిడిఎస్ సూపర్వైజర్లు , సంధ్య,  పరమేశ్వరి ,వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State