భారత రాష్ట్ర సమితి అలంపూర్ తాలూకా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశం.

May 3, 2024 - 21:28
May 4, 2024 - 20:15
 0  36

జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. ఎర్రవల్లి.బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాల సాగర్ ఫంక్షన్ హాల్ నందు భారత రాష్ట్ర సమితి అలంపూర్ తాలూకా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎమ్మెల్సీ చల్ల  వెంకటరామిరెడ్డి మరియు అలంపూర్ శాసనసభ్యులు విజయుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఎమ్మెల్సీ చల్ల వెంకటరామిరెడ్డి  మరియు ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ..... ప్రభుత్వం  ఇచ్చిన హామీలను  నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం త్వరలోనే కోల్పోతుందని  అన్నారు . క్రింద మంట పైన మంట కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రజలు మంటగానే ఉన్నారని ఆయన బిఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం 6 గంట 9 గంటల వరకు  సాయంత్రం ఐదు గంటల నుంచి  నుంచి 8 గంటల వరకు కష్టపడి పనిచేయాలని   ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి బిఆర్ఎస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State