భరోసా నూతన భవనాన్ని పరిలించిన జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రం లోని రెవెన్యూ కాలనిలో నూతనంగా నిర్మాణం అయిన భరోసా భవనాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు,IPS అదనపు ఎస్పీ శ్రీ గుణ శేఖర్ తో కలిసి పరిశీలించారు. 2 కోట్లతో నిర్మించిన భవన నిర్మాణం పూర్తి కావచ్చినందున త్వరలో ప్రారంభించేందుకు భవనాన్ని సిద్ధం చేయాలని భరోసా ఇంచార్జి ఎస్సై అరుణ కి సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ సిఐ బీమ్ కుమార్, భరోసా కో ఆర్డినేటర్ శివాని తదితరులు పాల్గొన్నారు.