దుండగులపై పోరాడిన వీరోచిత మహిళలకు డీసీపీ హరిణీ సత్కారం

Mar 22, 2024 - 19:47
 0  1
దుండగులపై పోరాడిన వీరోచిత మహిళలకు డీసీపీ హరిణీ సత్కారం

హైదరాబాద్:- గన్‌తో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులపై వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన మహిళలను నార్త్ జోన్ డీసీపీ సత్కరించారు. బేగంపేట పైగా ప్యాలెస్ లోని ఓ ఇంట్లోకి మాస్క్, హెల్మెట్ దరించిన ఇద్దరు దుండగులు కత్తి, తుపాకీతో ప్రవేశించారు. ఆ ఇంట్లోని తల్లీకూతుర్లు ఇద్దరూ వారిపై వీరోచితంగా పోరాడి అగంతకులు పారిపోయేలా చేశారు. ఆ ఘటనకి సంబందించిన సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన నార్త్ జోన్ డీసీపీ హరిణీ ప్రియదర్శిని వారి ధైర్యసహసాలను కొనియాడారు. ఆ తల్లీకూతుళ్ల పోరాట పఠిమను మెచ్చుకొని, వారికి శాలువాలు కప్పి సన్మానించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333