డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Mar 15, 2025 - 20:15
Mar 15, 2025 - 20:51
 0  9
డ్రగ్స్,సైబర్ నేరాలపై  అవగాహన సదస్సు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఆత్మకూర్ PS పరిది ఎస్పీ కె.నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు*ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ గారు,మండల కేంద్రంలోనీ మహాత్మా జ్యోతి బాపులె బాలుర పాఠశాల లోసైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* *SI శ్రీకాంత్ గౌడ్ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి కె. నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై** *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తె *లిపినారు.* *వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు* *గంజాయి మత్తుమందులకు* *సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.* *షీ టీం ఏఎస్ఐ సాలయ్య గారు మాట్లాడుతూ ఆడపిల్లలు మహిళల రక్షణ కొరకు నిరంతరం షీ టీమ్స్ పనిచేస్తున్నాయి, ఆకతాయిల వేధింపు ఆటలు సాగవనీ, ఎవరైనా ఆడపిల్లలను ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా షీ టీమ్స్ (8712686056)కి ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు* *అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థులకు అవగాహన* *కల్పించారు* *ఈ కార్యక్రమం నందు మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపల్ షేక్ బిల్ కుష్, పోలీస్ సిబ్బంది HC వీరారెడ్డి, కానిస్టేబుల్ పవన్ కుమార్, మధు, మధుసూదన్ రెడ్డి, అంతయ్య కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ, చారీ, గురులింగం, విద్యార్థినిలు ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.*