గాయత్రి గోమాతకు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల గాయత్రి గోమాతకు పౌర్ణమి పురస్కరించుకొని గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో అర్చకులు వినయ్ కౌశల్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తదుపరి ఆలయంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం, పురుషులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా గాయత్రి గోమాతకు సమర్పించిన చీర శ్రీమతి శాంత కు బహుమతి గా ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో
పూర్ణిమ, నర్సింగ్ శాంత , గీత, చిన్నారి అనన్య మరియు అద్యక్షుడు గాయత్రి శ్రీనివాసులు, కార్యదర్శి మాణిక్యం వెంకటేశ్వర్లు,
రామచంద్రుడు , శివ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.