గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో తిరగని ఫ్యాన్లు

వేడికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Oct 5, 2024 - 19:58
Oct 6, 2024 - 17:59
 0  8

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని ఫ్లాట్ ఫామ్ లో దగ్గర ప్రయాణికులు రద్దీగా ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఫ్యాన్లు తిరగకుండగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కనీసం పలకరించే నాథుడు కరువయ్యాడు గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రయాణికులకు కనీస అవసరాలు ఫ్యాన్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ఉందని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లాలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State