ఐజ పోలీస్ స్టేషన్ ను పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన

Mar 27, 2025 - 01:58
Mar 27, 2025 - 02:00
 0  3
ఐజ పోలీస్ స్టేషన్ ను పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన
ఐజ పోలీస్ స్టేషన్ ను పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన

జోగులాంబ గద్వాల 26 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ పట్టణం లోని పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను, ఉత్తనూరు ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించి పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఏలాంటి లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం అని, పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విద్యా శాఖ అధికారులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకుంటు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహణ ఉండాలనీ ఆదేశించారు.అలాగే పరీక్షా కేంద్రాలలోనికి సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని , దగ్గర్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష పూర్తి అయ్యేంతవరకు మూసి ఉంచే విధంగా సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఐజ పోలీస్ స్టేషన్ సందర్శన 10 వ తరగతి కేంద్రాలను సందర్శించి పరిశీలించిన అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డ్ లను మరియు సిబ్బంది నిర్వహిస్తున్న విదులను పరిశీలించారు. అందులో భాగంగా సిబ్బంది తో మాట్లాడుతూ వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అన్నీ రకాల విధుల పట్ల సిబ్బంది అవగాహాన కలిగి ఉండాలనీ, గ్రామాలలో ప్రజలతో లైసనింగ్ మెయింటేన్ చేస్తూ నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించాలని అన్నారు. ఫిర్యాదు దారులతో గౌరవం తో మెలుగుతూ బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరిసరాలను పరిశీలించి స్టేషన్ ఆవరణం లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనీ, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్సై శ్రీనివాస్ కు సూచించారు.ఎస్పి వెంట డి.ఎస్పివై మోగిలయ్య, శాంతి నగర్ సీఐ టాటా బాబు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State