ఉన్నంత విద్య మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి..

Oct 16, 2024 - 17:24
 0  2
ఉన్నంత విద్య మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి..

హైదరాబాద్:అక్టోబర్ 16 తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి,నియామ‌కం అయ్యారు. వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తం నియామ‌కం అయ్యారు. 

ఈ మేర‌కు విద్యా శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం ఉత్త‌ర్వులు జారీ చేశారు.ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి, న్యాయ క‌ళాశాల‌లో సేవ‌లందిం చారు. ఇటిక్యాల పురుషోత్తం ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎక‌నా మిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేశారు. పురుషోత్తం ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

ప్ర‌స్తుతం ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి 2021 ఆగస్టు 24న ఉన్నత విద్యామండలి ఆఫిషియేట్‌ చైర్మన్‌గా తాత్కాలిక హోదా నియమితుల‌య్యారు. 

2021 నుంచి 2023 వ‌ర‌కు ఆయన చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023, జూన్‌లో పూర్తి స్థాయి చైర్మన్‌ హోదాను కట్టబెట్టింది. 

ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన అదే ఏడాది జూలైలో పదవీ విరమణ పొందారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333