ఆర్థిక సాయం అందజేత
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి. మండలం బుడమర్సు గ్రామంలో కుర్వ వెంకటేశ్వర్లు కి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు గత వారం క్రితం బుడమర్సు గ్రామంలో కుర్వ వెంకటేశ్వర్లు s/o. తిక్కయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయింది.ఈ విషయం తెలుసుకొని ఆయన గృహానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. ఆదేశానుసారం ఆ కుటుంబానికి దైర్యం చెప్పి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వెంకట్రామన్ (చిన్ని),జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగశిరోమణి సర్పంచ్ గోవిందమ్మ రాజశేఖర్ ,మాజీ సర్పంచ్ తిమ్మప్ప తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.