ఆదిశిలాక్షేత్రంలో భక్తుల పూజలు.

May 18, 2024 - 21:51
May 18, 2024 - 22:08
 0  52

జోగులాంబ గద్వాల 18 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు సమర్పించుకుననారు. ఉదయం ఆలయంలో అర్చకులు, వాల్మీకి పూజారులు అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు మల్దకల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ పూజయ్య దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, దీరేంద్ర దాస్, అర్చకులు రమేష్ ఆచారి,రవి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు, రామలింగం, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State