అక్షర యోధుడు రామోజీరావు....

Jun 9, 2024 - 20:05
Jun 9, 2024 - 20:10
 0  31
అక్షర యోధుడు రామోజీరావు....

సూర్యాపేటలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి సంతాపం తెలిపిన జర్నలిస్టులు....

సూర్యాపేట 10 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని వివిధ హోదాల్లో పని చేస్తున్న సూర్యాపేట జర్నలిస్టులు ఆన్నారు.ఆయన మృతి పట్ల ఆదివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సంధర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ బహు ముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు గుర్తింపు పొందారని ఆన్నారు.ఆయన ఏర్పాటు చేసిన   అనేక సంస్థల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు.

 ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనవని,అందుకే జర్నలిజం దిక్సూచి రామోజీరావు అని కొనియాడారు.పత్రికా రంగాల్లో రామోజీ రావు ఒక లెజెండ్‌ గా నిలిచిపోయారనీ గుర్తు చేశారు.అనంతరం రామోజీరావు ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాపం ప్రకటించిన వారిలో వజ్జే వీరయ్య యాదవ్,గుండా శ్రీనివాస్ గుప్తా,చల్లా చంద్రశేఖర్, బంటు కృష్ణ,బుక్క రాంబాబు, ఊటుకూరి రవీందర్,రాపర్తి మహేష్,కందుకూరి యాదగిరి,బత్తుల మారయ్య, బత్తుల మల్లికార్జున్,రెబ్బ విజయ్,గుణగంటి సురేష్, నజీర్,వెంకటయ్య,గట్టు అశోక్, శ్రీనివాస్,నాగేందర్,బ్రహ్మ చారి,సైదులు,శంకర్,శ్రవణ్,రామాచారి,బాచి తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333