ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు

Mar 9, 2024 - 00:13
Mar 9, 2024 - 00:35
 0  102
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు

జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో పట్టణ అధ్యక్షుడు బండల వెంకటరాములు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి వంట గ్యాస్ పై ధర 100 రూ" తగ్గించడం తో పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు మరియు మహిళలు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ... వంట గ్యాస్‌ సిలిండర్‌ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ప్రకటించారని అన్నారు.. దీని వల్ల లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా ‘నారీశక్తి’కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వంటగ్యాస్‌ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల అభివృద్ధి, శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి శివారెడ్డి, కౌన్సిలర్ రజక జయశ్రీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాసు, అసెంబ్లీ కో కన్వీనర్ శ్యాం, బిజెపి సీనియర్ నాయకులు డబ్బిలేటి నరసింహ, రఘు గౌడ్, ఢిల్లీ వాలాక్రిష్ణ ,గాంజా సాయి,రాజేందర్, తదితరులు హాజరయ్యారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State