- 30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు.

Mar 10, 2025 - 21:32
Mar 10, 2025 - 21:33
 0  3
- 30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు.
  •  ఒక నిందితున్ని సను ఖిలా @ శ్రీను , వయస్సు: 35 సంవత్సరములు, గ్రామం ఆంగోటు గూడ,  సత్వ పంచాయతీ, కోరా ఫుట్ జిల్లా ను)   అరెస్ట్ చేయడం జరిగినది.
  • - మరొక నిందితుడు పూర్ణ, నివాసం: పుల్లికొండ గ్రామము, కోరా ఫుట్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రం పరారీలో ఉన్నాడు.
    - అరెస్టు చేసిన నిందితుని  నుండి 3,05,000 విలువ గల 30 కిలోల గంజాయి, ఒక  సెల్ ఫోన్ స్వాధీనం.
    -

జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ.

కేసు వివరాలు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 35 సంవత్సరముల వయస్సు గల  సను ఖిలా @ శ్రీను  అనే వ్యక్తి  వాళ్ళ ఏరియాలో  పుల్లికొండ  గ్రామానికి చెందిన పూర్ణ దగ్గర గంజాయిని తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి, కావాల్సిన వారికి కిలో ఒక్కంటికి ఎక్కువ రేటుకు  అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. ఈ మధ్య కాలములో  మా ఏరియాలో గంజాయిని కిలో ఒక్కంటికి 1500 రూపాయల చొప్పున కొని, దూల్ పేట ఏరియా, హైద్రాబాదు లో అమ్ముకుంటే కిలో ఒక్కంటికి 10,000/- చొప్పున వస్తాయని తెలిసి, హైద్రాబాదు కు గంజాయిని తీసుకవెళ్ళి హైద్రాబాద్ లో అమ్ముకోవాలని నిశ్చయించుకుని,  తేదీ 09.03.2025 రోజున పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ, అను వ్యక్తి దగ్గర 30 కిలోల గంజాయిని కిలో ఒక్కంటికి 1500/- రూపాయల చొప్పున కొనగా,  పూర్ణ మొత్తం 15 ప్యాకెట్లు గా ప్యాక్ చేసి ఇవ్వగా, సదరు సను ఖిల @ శ్రీను  వాటిని  ఒక  సూపర్ బస్తాలో పెట్టుకొని, ఒక లారీ ఎక్కి హైద్రాబాదు పోవడానికి  ఇక్కడి వరకు వచ్చి, లారీ డ్రైవరు  సైడ్ కు వెళ్తానంటే, ఈ రోజు అనగా తేదీ 10.03.2025 ఉదయం అందాజ 8.30 గంటల సమయములో, సదరు సను ఖిల @ శ్రీను  గంజాయి బస్తా తో యుక్తముగా లారీ దిగి, గంజాయి గల  సూపర్ బస్తా ను చెట్లలో పెట్టి, హైద్రాబాదు పోవడానికి రోడ్డు ప్రక్కన నిలబడి వాహనాలు ఆపుతుండగా బ్లూ కొల్ట్ పోలీస్ వారు  సదరు వ్యక్తిని అనుమానించి అందాజ ఉదయం 9 గంటల సమయమున పట్టుకున్నారు. ఇట్టి కేసులో పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
సను ఖిలా @ శ్రీను పై  గతములో ఎలాంటి కేసులు లేవు.
 గంజాయి విలువ 3,00,000/- మరియు సెల్ ఫోన్ విలువ 5,000/- మొత్తం విలువ 3,05,000/- రూపాయలు  ఉంటుందని అంచనా వేయడం జరిగింది.  

సదరు నేరస్థున్ని  పట్టుబడి చేసిన దాంట్లో మునగాల  ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ , హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్స్  శివ కోటేశ్వర్ రావు, ఎల్లారెడ్డి సతీష్ మరియు రాంబాబు, పర్యవేక్షణ చేసిన సిఐ రామకృష్ణారెడ్డిని పోలీస్ అధికారులు అబినందించినారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333