- 30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు.

- ఒక నిందితున్ని సను ఖిలా @ శ్రీను , వయస్సు: 35 సంవత్సరములు, గ్రామం ఆంగోటు గూడ, సత్వ పంచాయతీ, కోరా ఫుట్ జిల్లా ను) అరెస్ట్ చేయడం జరిగినది.
- - మరొక నిందితుడు పూర్ణ, నివాసం: పుల్లికొండ గ్రామము, కోరా ఫుట్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రం పరారీలో ఉన్నాడు.
- అరెస్టు చేసిన నిందితుని నుండి 3,05,000 విలువ గల 30 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం.
-
జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ.
కేసు వివరాలు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 35 సంవత్సరముల వయస్సు గల సను ఖిలా @ శ్రీను అనే వ్యక్తి వాళ్ళ ఏరియాలో పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ దగ్గర గంజాయిని తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి, కావాల్సిన వారికి కిలో ఒక్కంటికి ఎక్కువ రేటుకు అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. ఈ మధ్య కాలములో మా ఏరియాలో గంజాయిని కిలో ఒక్కంటికి 1500 రూపాయల చొప్పున కొని, దూల్ పేట ఏరియా, హైద్రాబాదు లో అమ్ముకుంటే కిలో ఒక్కంటికి 10,000/- చొప్పున వస్తాయని తెలిసి, హైద్రాబాదు కు గంజాయిని తీసుకవెళ్ళి హైద్రాబాద్ లో అమ్ముకోవాలని నిశ్చయించుకుని, తేదీ 09.03.2025 రోజున పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ, అను వ్యక్తి దగ్గర 30 కిలోల గంజాయిని కిలో ఒక్కంటికి 1500/- రూపాయల చొప్పున కొనగా, పూర్ణ మొత్తం 15 ప్యాకెట్లు గా ప్యాక్ చేసి ఇవ్వగా, సదరు సను ఖిల @ శ్రీను వాటిని ఒక సూపర్ బస్తాలో పెట్టుకొని, ఒక లారీ ఎక్కి హైద్రాబాదు పోవడానికి ఇక్కడి వరకు వచ్చి, లారీ డ్రైవరు సైడ్ కు వెళ్తానంటే, ఈ రోజు అనగా తేదీ 10.03.2025 ఉదయం అందాజ 8.30 గంటల సమయములో, సదరు సను ఖిల @ శ్రీను గంజాయి బస్తా తో యుక్తముగా లారీ దిగి, గంజాయి గల సూపర్ బస్తా ను చెట్లలో పెట్టి, హైద్రాబాదు పోవడానికి రోడ్డు ప్రక్కన నిలబడి వాహనాలు ఆపుతుండగా బ్లూ కొల్ట్ పోలీస్ వారు సదరు వ్యక్తిని అనుమానించి అందాజ ఉదయం 9 గంటల సమయమున పట్టుకున్నారు. ఇట్టి కేసులో పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
సను ఖిలా @ శ్రీను పై గతములో ఎలాంటి కేసులు లేవు.
గంజాయి విలువ 3,00,000/- మరియు సెల్ ఫోన్ విలువ 5,000/- మొత్తం విలువ 3,05,000/- రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది.
సదరు నేరస్థున్ని పట్టుబడి చేసిన దాంట్లో మునగాల ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ , హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్స్ శివ కోటేశ్వర్ రావు, ఎల్లారెడ్డి సతీష్ మరియు రాంబాబు, పర్యవేక్షణ చేసిన సిఐ రామకృష్ణారెడ్డిని పోలీస్ అధికారులు అబినందించినారు.