11వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు

భువనగిరి 19 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల వాయిస్ మాస పత్రిక 11వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ హన్మంతరావు,పత్రిక ఎడిటర్ యం అడివయ్య, ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి,జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రకాష్, కార్యదర్శి ఉపేందర్, కోశాధికారి లలితలతో కలిసి ఆయన ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ యం హన్మంత రావు మాట్లాడుతూ.. వికలాంగులతో పాటు సకలాంగులలో చైతన్యం తీసుకురావడానికి వికలాంగుల వాయిస్ మాస పత్రిక చెస్తున్న కృషి అభినందననియమని అన్నారు. పత్రికల ద్వారా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. పత్రికల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.సమాజంలో వికలాంగులు అనేక రకాలుగా వివక్షతకు గుర…