**సైబర్ నేరాలు మహిళ భద్రత, షీ టీమ్స్ గంజాయి అవగాహన""నేరేడుచర్ల పిఎస్*

Mar 17, 2025 - 19:13
Mar 17, 2025 - 21:07
 0  28
**సైబర్ నేరాలు మహిళ భద్రత, షీ టీమ్స్ గంజాయి అవగాహన""నేరేడుచర్ల పిఎస్*

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన*

 నేరేడుచర్ల PS పరిది

 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నేరేడుచర్ల SI రవీందర్ నాయక్ గారు, మండల కేంద్రంలోని చిల్లేపల్లి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాలు, మహిళల భద్రత, షీ టీమ్స్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.** 

SI రవీందర్ గారూ మాట్లాడుతు జిల్లా ఎస్పి కె నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సైబర్ నేరాలపై, మహిళల భద్రత, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలి,మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తె *లిపినారు.* 

 వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు* 

గంజాయి మత్తుమందులకు* *సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.*  అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన* *కల్పించారు* 

ఈ కార్యక్రమం నందు మహాత్మ జ్యోతిబాపూలే కళాశాల ప్రిన్సిపల్ అనుకరణ,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి ,గురులింగం, నాగార్జున విద్యార్థినిలు, పాల్గొన్నారు.*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State