శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల 31 జులై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ ఈరోజు శ్రీ జోగులాంబ దేవి అమ్మవారు ,శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు.ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే ని ఆహ్వానించారు. స్వామి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కి ఆలయ అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు స్వామి, అమ్మవార్ల ప్రసాదం పంపిణీ చేయడం జరిగినది._
_అలంపూరు . పట్టణంలో... కేంద్ర ప్రభుత్వం 36 కోట్లతో నిర్మించిన ప్రసాద్ స్కీం భవనంలో.. నిత్య అన్నదాన సత్రం ను ప్రారంభించిన_ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ...
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.