రాజోలి మండలం..చిన్న ధన్వాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో
మద్యం తాగిన మత్తులో పాఠశాల ఆవరణలో తరగతి గదుల్లో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు రవిచందర్.
ఇతని ప్రవర్తన పై ఉపాధ్యాయుడిని నిలదీసిన గ్రామస్తులు.
జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : రాజోలి గ్రామస్తులకు..అయితే ఏమైతది సస్పెండ్ చేస్తారు , ఆ టైంలో సగం జీతం వస్తుంది అని , కలెక్టర్ కైనా లంచం ఇచ్చి తిరిగి ఉద్యోగం సంపాదిస్తానని దురుసుగా సమాధానం ఇచ్చిన ఉపాధ్యాయుడు.. ఇతని ప్రవర్తన పై విచారణకు వచ్చిన రాజోలి మండల ఎంఈఓ భగీరథ రెడ్డి.. ఎంఈఓ వచ్చిన సమయంలో పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలో మద్యం మత్తులో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు రవిచందర్.. ఉపాధ్యాయుడిని విచారించి అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎంఈఓ..