ముమ్మరంగా కొనసాగుతున్న వీధి కుక్కల తరలింపు.
జోగులాంబ గద్వాల15 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం గద్వాల మున్సిపాలిటి పరిధిలోని భీంనగర్ లో 16వార్డు కౌన్సిలర్ వేదావతి వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్, పశుసంవర్ధక శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలనీలో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక సిబ్బంది సహాయంతో సురక్షితంగా నిర్బంధించి, స్థానిక పశువుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వాటికి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం వీటికి యాంటీ-రేబిస్ టీకాలు కూడా వేయనున్నారు. వార్డులలో కుక్కల సంఖ్యను అదుపు చేయడంతో పాటు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకే ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్లు పూర్తయిన తర్వాత, కోలుకున్న కుక్కలను తిరిగి యథాస్థానంలోనే వదిలిపెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలి సిబ్బంది తదితరులు ఉన్నారు.