ప్రజావాణిలో 15 ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల ప్రజావా ఎస్పీణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 15 మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ కి ఫిర్యాదులు అందించారు. బాధితులు అందజేసిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. అలగే అక్కడే ఉన్న డి. ఎస్పీ మొగిలయ్య, శాంతి నగర్ సర్కిల్ అధికారులకు ఆయ పరిదిలో నీ ఫిర్యాదుల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా
ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా పోలీస్ అధికారుల పనీతిరు ఉండాలని అన్నారు.
ఈ రోజు ప్రజావాణిలో మొత్తం 15ఫిర్యాదులు
భూ వివాదాలకు సంబందించి - 06
కుటుంబ తగాదాలకు సంబందించి -01
గొడవలకు సంబంధించి - 02
ఇతర అంశాలకు సంబంధించి -06 పిర్యాదులు వచ్చాయి అని పిఆర్ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.