పోలీస్ ప్రజా వాణికి 21 పిర్యాదులు

Aug 4, 2025 - 19:15
 0  8
పోలీస్ ప్రజా వాణికి 21 పిర్యాదులు

జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం గద్వాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 21 మంది బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు క్షుణ్ణంగా పరిశీలించి వారి  సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు  చేపట్టాలని  పోలీస్ అధికారులను ఆదేశించారు.భూ వివాదాలకు సంబందించిన  పిర్యాదులు,కొడుకులు తల్లిదండ్రులు లను చూడక పోవడం,భార్య భర్తల మధ్య వేధింపుల పిర్యాదులు,గొడవలు,లైంగిక వేధింపులకు సంబంధించిన పిర్యాదులను జిల్లా ఎస్పీ  పరిశీలించారు.ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత  ఎస్సై లను,సీ.ఐ లను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై.మోగిలయ్య,అలంపూర్,గద్వాల సీఐలు రవి బాబు,టాటా బాబు,పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333