పెన్షనర్స్ డే డైరీ ఆవిష్కరణ చేసిన ఎంపీ డాక్టర్"కడియం కావ్య

Jan 30, 2025 - 13:52
Jan 30, 2025 - 13:54
 0  7
పెన్షనర్స్ డే  డైరీ ఆవిష్కరణ చేసిన ఎంపీ డాక్టర్"కడియం కావ్య
పెన్షనర్స్ డే  డైరీ ఆవిష్కరణ చేసిన ఎంపీ డాక్టర్"కడియం కావ్య
పెన్షనర్స్ డే  డైరీ ఆవిష్కరణ చేసిన ఎంపీ డాక్టర్"కడియం కావ్య

పెన్షనర్స్ డే డైరీ ఆవిష్కరణ చేసిన ఎంపీ డాక్టర్"కడియం కావ్య

హనుమకొండ 29 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్" కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్" కడియం కావ్య మాట్లాడుతూ..సీనియర్ సిటిజెన్స్ నాలెడ్జ్ భవిష్యత్ తరాలకు బంగారు గనులతో సమానమని వరంగల్ ఎంపీ డాక్టర్"కడియం కావ్య అన్నారు. ఒక పుస్తకం చదివితే వందేళ్ల చరిత్ర తెలుస్తోందని, వందేళ్ల జీవితాన్ని చూడాలంటే ఇలాంటి పెద్ద వాళ్ళ అనుభావం, వారు చెప్పే సూచనలు సలహాల ద్వారా నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక్కడున్న ప్రతి సీనియర్ సిటిజన్ నా కుటుంబ సభ్యులని మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ కి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ఏక్కడ ఆటంకం కలగకుండా మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.ఇప్పటికే వరంగల్ జిల్లాకు వెల్నెస్ సెంటర్ మంజూరు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్ లో వరంగల్ జిల్లా సమస్యలను కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తూ 6వేల కోట్లు మంజూరు ఇచ్చారని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానని ఎంపీ తెలిపారు. విశ్రాంత కళాశాల అద్యాపకుల సంఘం శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎంపీ ఫండ్స్ నుండి గేమ్స్ సామాగ్రిని సమకూరుస్తానని వెల్లడించారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ సి టి ఏ టి వరంగల్ ప్రెసిడెంట్ పులి సారంగపాణి, స్టేట్ ప్రెసిడెంట్ సిహెచ్ విద్యాసాగర్, ఆలిండియా ఫెడరేషన్ రిటైర్డ్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.