జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో మరియు బ్యాంకుల యందు వెంటనే ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి

May 17, 2025 - 19:06
 0  39
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో మరియు బ్యాంకుల యందు వెంటనే ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో మరియు బ్యాంకుల యందు వెంటనే ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి

భువనగిరి 17 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  జిల్లా కేంద్రంలో 1000 గజాల స్థలంలో వికలాంగుల భవనాన్ని నిర్మించాలి!కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన వికలాంగులు కార్యాలయ ఏవో జగన్ కు వినతి పత్రం.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది.అనంతరం జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కే వెంకట్  రావడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు వికలాంగులకు అనుకూలంగా లేవని ఆపిడి ఆక్ట్ -2016 ప్రకారం వాటిని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల అప్పుడు మాత్రమే వారికి అవసరం ఉన్న చోట ర్యాంపులు ఏర్పాటు చేసి ఓట్లు దండుకోవడం తప్ప సాధారణ సమయాల్లో వికలాంగులు అనుకూలంగా ఆఫీస్ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదని వెంటనే డ్రాప్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా జిల్లా కేంద్రంలో వికలాంగులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం వెయ్యి గజాలలో వికలాంగుల సామాజిక భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అందులలిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ మరియు హెలెన్ కిల్లర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం ఉపేందర్ మాట్లాడుతూ..జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయడం.లేనియెడల పెద్ద ఎత్తున వికలాంగులను  సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది.కలెక్టర్ కార్యాలయ ఏవో జగన్ హామీ.జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారితో సంప్రదించి సమావేశం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి,జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు జిల్లా సహాయ కార్యదర్శులు పిట్ట శ్యామ్ సుందర్, శివయ్య జిల్లా నాయకులు పాండాలు శ్రీహరి,బానోత్ లింగ్య నాయక్ , బానోత్ రావోజి నాయక్,నరేష్ సావిత్రి బోయపల్లి యాదగిరి,వి మంజుల,వెంకటేశం నాగ నరసింహ తదితరులు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333